MBNR: చిన్న చింతకుంట మండలంలోని దమాగ్నాపూర్ గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పలు గ్రామాల ప్రజలు కలిసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం బండ్రవల్లి గ్రామానికి చెందిన స్వతంత్ర వార్డు సభ్యుడు గోపాల్, రాజు చారి, రామచంద్రయ్యలతో పాటు అప్పరాల గ్రామానికి చెందిన న్యాయవాది నాగిరెడ్డి తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.