GDWL: జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్ను ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప, కౌన్సిలర్లు పాల్గొన్నారు.