MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యలు ఉండకూడదని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 47, 48 డివిజన్లో డిప్యూటీ మేయర్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈ, ఏఈతో మాట్లాడుతూ.. సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.