RR: షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం వెంకిర్యాల గ్రామ సర్పంచ్ భర్త జంగయ్య మృతి చెందాడు. లాల్ పాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. జంగయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.