NLG: చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన కోరమోని శ్రీనుకు మంజూరైన రూ. 60,000 ల సీఎం సహాయ నిధి చెక్కును ఆ గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ బుధవారం అందించారు. పరిస్థితిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి సర్పంచ్ తీసుకెళ్లగా చెక్కును మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆరూరి రాములు, శ్రీనివాస్, శ్రీను, అశోక్, ధనయ్య, నర్సింహా పాల్గొన్నారు.