SGR: పంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జ్ పంచాయతీ అధికారి జానకి రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు రహమాన్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు మూడు నెలల వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటనే అధికారులు స్పందించి వేతనాలు చెల్లించాలని కోరారు.