GDWL: గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో మతసామరస్యం వెల్లివిరిసింది. సర్పంచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జామియా మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు సర్పంచ్ను శాలువాతో సన్మానించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మెలగాలని వారు ఆకాంక్షించారు.