TPT: సత్యవేడు నియోజకవర్గంలో అనుమతులు పొందిన గ్రావెల్ క్వారీల వద్ద తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగురువం బాబు సుడిగాలి పర్యటన చేశారు. విచ్చలవిడిగా క్వారీలకు అనుమతులు ఇవ్వడం వల్ల గ్రామాల ప్రశాంతత దెబ్బతింటోందని, రహదారులు పాడవుతున్నాయని తెలిపారు. అనుమతులు ఆపకపోతే సీఎం దృష్టికి తీసుకెళ్లి నిరసనలు చేపడతామని హెచ్చరించారు.