AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈనెల 8న నాటు తుపాకీ ప్రమాదవశాత్తు పేలి ఆడారి కౌశిక్ (12) మృతి చెందిన ఘటనలో మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. లైసెన్స్ లేకుండా కె. సూరిబాబు వద్ద రెండు నాటు తుపాకులు కలిగి ఉన్నట్లు తెలిపారు. సూరిబాబు కొడుకు తన స్నేహితులను ఇంటికి తీసుకువెళ్లి నాటు తుపాకీలు చూపిస్తున్న సందర్భంగా ఒకటి మిస్ ఫైర్ అయిందని పేర్కొన్నారు.