NZB: మాక్లూర్ మండలం ధర్మోరకి చెందిన మోహన్ అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 1.75 లక్షల ఎల్వోసీ మంజూరైంది. మంగళవారం ఆయన ఈ పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపదలో అండగా నిలిచిన వినయ్ రెడ్డికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.