KRNL: మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులను సామర్థ్యానికి మించి ఎక్కించుకోకూడదని వాహనాల డ్రైవర్లకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం స్పష్టం చేశారు. భక్తుల క్షేమమే ప్రధాన లక్షమని తెలిపారు. లోడింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు. అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.