ADB: ఇంద్రవెల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్యులు ఉచిత వైద్యం అందించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల మెరుగైన ఆరోగ్యం కోసం ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.