NRML: చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలంలోని మొర్రిగూడెం, హరిజనవాడ గ్రామాల్లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈదుల తిరుపతి, నాయకులు మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.