GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామం నుంచి సంఘాల రోడ్డువరకు బీటీ రోడ్డు వేశారు. అయితే సైడ్లకు మట్టి వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన లోతుగా ఉండటంతో వాహనాలు జారి పలువురు గాయపడుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు ఆర్ అండ్ బీ అధికారులు వెంటనే సైడ్ మట్టి వేయాలని ప్రజలు కోరుతున్నారు.