BHPL: అంత్య పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.