WGL: సంగెం మండలంలో కేజీబీవి, యుఆర్ఎస్, సమగ్ర శిక్షా సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం సంగెం మండల కేంద్రంలోని కేజీబీవీ, ఎంఆర్సీ కేంద్రాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కోరారు.