కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు తీవ్ర అస్వస్థత గురయ్యారు. హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. యూపీఏ ప్రభుత్వంలో కావూరి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఏపీలోని మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి పలుమార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. కాగా, సాంబశివరావు ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.