GDWL: గద్వాల ఆసుపత్రి గోడలపై వేసిన మహానీయుల చిత్రాలు అధికారుల నిర్లక్ష్యంతో చెత్తలో కనిపించకుండా పోతున్నాయి. ప్రహరీ గోడ వెంట చెత్త, ముళ్లపొదలు పెరగడంతో చిత్రాలు ముసుగైపోయాయి. పరిసరాల్లో పారిశుద్ధ్యం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.