NLG: శెట్టిపాలెంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ సోమవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదల దశాబ్దాల సొంతింటి కల నిజమైందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు పనులకు కూడా వారు శంకుస్థాపన చేశారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి పనులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.