E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, హెల్త్ పింఛన్లు, ఇళ్లు ఇప్పించాలని కోరుతూ బాధితులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.