ATP: ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల కోసం పని చేసేవారే నిజమైన నాయకులని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇన్ ఛార్జిలతో ఆయన సమావేశమయ్యారు. సచివాలయాల వారీగా సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చొరవ చూపాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.