HYD: మార్చి 25, 26 తేదీల్లో HYDలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన విద్యావేత్తలు, పరిశోధకులు, నిపుణులు హాజరుకానున్నారు. దూరవిద్య ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాల విస్తరణపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. విద్యా రంగంలో మారుతున్న పరిస్థితులు, నూతన సాంకేతికతలపై ప్రసంగాలు ఉండనున్నాయి.