AKP: దేవరాపల్లి మండల ఎంపీడీవోగా ఎస్. కిరణ్ వరప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎం.వి. సువర్ణరాజు జిల్లా కోఆర్డినేటర్ (ఎస్ఈబ్ల్యూపీసీ)గా డిప్యూటేషన్పై వెళ్లడంతో ఆయన స్థానంలో కిరణ్ వరప్రసాద్ నియమితులయ్యారు. కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.