ADB: గ్రామస్తులందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో నిర్వహించిన సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.