TG: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో రైతులకు కన్నీరు మిగిలింది. గూడూరు మండలం భూపతిపేట రైతులు 1,200 కిలోల టమాటాలను విక్రయానికి తీసుకురాగా.. 20 కిలోల పెట్టెను రూ.50కి కూడా కొనేవారు కరువయ్యారు. విసుగు చెందిన రైతులు తమ కష్టాన్ని వృథా చేయలేక, మహిళలందరికీ టమాటాలను ఉచితంగా పంపిణీ చేశారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.