E.G: రాజమండ్రి త్యాగరాజు సేవా సమితి మలబార్ గోల్డ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన సీఎస్ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆదివారం ప్రభుత్వ కళాశాలలకు చెందిన 286 మంది మెరిట్ విద్యార్థులకు రూ. 22.56 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్కరణలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం గర్వకారణమన్నారు.