దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ మూవీకి భారీ బజ్ నెలకొంది. ఈ క్రమంలో ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కోసం ఫార్స్ ఫిలిమ్స్ ఏకంగా రూ.160 కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అన్ని ఇండియన్ భాషలకు కలిపి ఈ స్థాయిలో ధర పలకడం రికార్డు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి.