ATP: అనంతపురం నగరంలోని మహిళా, బాలల గ్రంథాలయ ఆడిటోరియంను నిరుద్యోగ యువత కోసం అత్యాధునిక స్టడీ హాల్గా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ తెలిపారు. శనివారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఆడిటోరియంను సందర్శించారు. భవన మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనపై వివరించారు.