MHBD: రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.