అనకాపల్లి నియోజకవర్గంలో ఆర్.అండ్.బీ రహదారుల అభివృద్ధికి రూ.5.10 కోట్లు నిధులు మంజూరైనట్లు కూటమి నేతలు నాగేశ్వరరావు, వెంకట సన్యాసినాయుడు, తాతారావు తెలిపారు. శనివారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చొరవతో నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.