మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.