VSP: చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా నియమితులైన విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి శనివారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.