ASR: అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని ప్రకటన చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి చిన్నారి డిమాండ్ చేశారు. శనివారం పాడేరులో మాట్లాడారు. ఈనెల 10న జీతాల పెంపు ప్రకటన చేయకపోతే, ఈనెల 11వ తేదీ నుంచి అంగన్వాడీలు అందరూ మళ్లీ రోడ్లపైకి వచ్చి, ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.