జగిత్యాల జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిజమైన దిక్సూచిగా ‘ప్రజావాణి’ నిలిచిందని SE బీ. సుదర్శనం ఆదివారం తెలిపారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలనే సంకల్పంతో ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సర్కిల్, డివిజన్, సెక్షన్ స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు.