NLR: బుచ్చి పట్టణంలోని పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థి తల్లులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటలను ఆడారు. ఆటలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారని, మహిళ ప్రాముఖ్యత ఎంతో ముఖ్యమని ఉపాధ్యాయుడు శ్రీధర్ తెలిపారు.