MBNR: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలను ఒక దారిన నడిపిస్తూ.. తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని వెల్లడించారు.