WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజా పాలన-ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ డా. సత్య శారద ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.