E.G: గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కడియం MPP వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం వీరవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల సేకరణలో భాగంగా గ్రామ సర్పంచ్ బత్తుల జయంతి భర్త రాము, తహసీల్దార్ సునీల్ కుమార్ పలు ప్రాంతాలను పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.