NGKL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరిగే 99 రోజుల ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు.