AKP: వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ సుందరయ్యపేట, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించి వాటర్ ట్యాంకులను పరిశీలించారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు.