గద్వాల మండలం అనంతపురంలో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కార్తీక్, గోపాల్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. MSPకి చట్టబద్ధత, రుణమాఫీ సాధించే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.