సత్యసాయి: హిందూపురం మోడల్ కాలనీలో శనివారం భారీ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో 40 మంది పోలీసు సిబ్బంది ప్రతి ఇంటిని సోదా చేసి రౌడీ షీటర్లపై నిఘా పెట్టారు. సరైన రికార్డులు లేని 55 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.