GNTR: పరిశుభ్రమైన పరిసరాలే మన లక్ష్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్రా–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పేరిచర్లలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటి, గ్రామంలో చెత్త ఊడ్చే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.