KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు రెండో వార్డ్ కౌన్సిలర్ రమణ రాథోడ్ తెలిపారు. శుక్రవారం మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కౌన్సిలర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.