VKB: ఆలంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద నిత్యం నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిరెడ్డిపల్లి, సంబంధిత తండాలకు వెళ్లే ఈ మార్గంలో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం. వర్షం లేకపోయినా నీరు నిలవడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.