VKB: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. పాత కొడంగల్ తండాకు చెందిన చిన్ని బాయి గృహ ప్రవేశానికి ఆయన హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామాల్లో ఏళ్లుగా సొంతింటిని కట్టుకోవాలన్న కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన అన్నారు.