GNTR: రాష్ట్రంలో పెరుగుతున్న ఆహార కల్తీ సమస్యను ప్రాణాంతక విపత్తుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి వెలగపూడిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ఆమె లేవనెత్తారు.