SRPT: ఆత్మకూరు మండలం కోటి నాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.