మహబూబాబాద్ పట్టణంలో ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో కలిసి గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ ను కలిశారు. రైతుల ఆదాయాన్ని రక్షించడానికి మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నల్లు సుధాకర్ రెడ్డి, పోలేపాక వెంకన్న, నాగరాజులు కలెక్టర్కు మొక్క అందజేసి అభినందనలు తెలిపారు.