SGR: పేదల భూములు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పేదల భూములను గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.